శంకర్, రాజమౌళి మధ్య యుద్ధానికి కారణం ఏమిటంటే ?
- April 12, 2017 / 09:21 AM ISTByFilmy Focus
దక్షిణాది సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం మంచి పేరున్న డైరక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, శంకర్. ఇద్దరూ ఇద్దరే. అపజయం అనే మాట వారి వద్దకు రావడానికి భయపడుతుంది. తమ చిత్రాలతో భారతీయ సినీ పరిశ్రమ స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకులు వీరు. రాజమౌళి గతాన్ని కళ్ళముందు ఆవిష్కరించడంలో దిట్ట అయితే.. శంకర్ భవిష్యత్ ను అందంగా చూపించడంలో నేర్పరి. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి 2 ఈనెల 28 న రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. శంకర్ రూపొందిస్తున్న 2.0 దీపావళికి విడుదల కానుంది. ఈ రెండు వెయ్యికోట్ల కలక్షన్స్ సాధించే సినిమాలే. ప్రపంచవ్యాప్తంగా వీరి సినిమాల కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
వీరిద్దరూ తమపనిలో నిమగ్నయి ఉంటే.. వీరి అభిమానులు మాత్రం మా డైరక్టర్ గొప్ప అంటే మా డైరక్టర్ గొప్ప అంటూ సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగారు. బాహుబలి 2 ఎక్కువ కలెక్ట్ చేస్తుందని జక్కన్న అభిమానులు పోస్ట్ లు చేస్తుంటే.. శంకర్ సినిమానే రికార్డులను కొల్లగొడుతుందని ఆయన ఫ్యాన్స్ సవాలు విసురుతున్నారు. ఈ వార్ ప్రభావం ఆ డైరక్టర్లపై పడిందని టాలీవుడ్, కోలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమాల రిలీజ్ సమయంలో ఈ వార్ పెద్దది అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












