అభిమానులైనప్పటికీ నేను దూరంగానే ఉంటాను : రెజీనా

  • March 19, 2020 / 04:33 PM IST

రెజీనా.. కెరీర్ ప్రారంభంలో కొన్ని హిట్లను అందుకుంది. దీంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఏ స్టార్ హీరో కూడా ఈమెకు అవకాశం ఇవ్వలేదు. గ్లామర్ షో విషయంలో తగ్గదు.. డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది.. అక్కడితో బాగానే ఉన్నప్పటికీ ఎందుకో నటనతో మాత్రం మెప్పించలేకపోయింది ఈ బ్యూటీ. అయితే తెలుగులో వర్కౌట్ అవ్వట్లేదు కదా అని.. తమిళంలో ట్రై చేసినా.. అక్కడ కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. గతేడాది ‘ఎవరు’ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రను.. చాలా బాగా చేసింది. అందుకుగాను ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం ఈమె చేతిలో 3 తమిళ సినిమాలున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా .. ఎవ్వరూ ఊహించని విధంగా కొన్ని కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను కానీ అభిమానులతో చాట్ చెయ్యను. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా నెగిటివిటినే కనిపిస్తోంది. కొంతమంది అదే పనిగా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటివి నాపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నేను ఎక్కువగా మానసిక ప్రశాంతనని కోరుకుంటాను. అలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చూస్తే నాకు భాదగా అనిపిస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకూ సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే కరెక్ట్ అనుకుంటాను. అభిమానులతో చాట్ చేయడం, వారితో ముచ్చటించడం మంచిదే.. కాదనడంలేదు.! కానీ కొంతమంది పర్సనల్ విషయాలని అడిగి ఇబ్బంది పెడుతుంటారు. అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు సోషల్ మీడియా లేని రోజుల్లో సెలబ్రిటీల జీవితాలు ప్రజలకు ఒక మిస్టరీ. అలాంటి పరిస్థితులనే నేను కూడా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus