Renu Desai: నిర్మాతగా మారబోతున్న రేణు దేశాయ్?

  • December 2, 2023 / 04:20 PM IST

సినీనటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒకానొక సమయంలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు. అయితే ఇప్పుడు మాత్రం ఈమె సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమాలో ఈమె హేమలత లవణం అనే పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె పాత్రకు కూడా పెద్దగా ఆదరణ రాలేదని చెప్పాలి.

ఇలా నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టువంటి ఈమె నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో రాణించాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే నిర్మాతగా సినిమాలను నిర్మించాలనే కళ నెరవేరబోతుందని తెలుస్తుంది. ఈమె పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారితో భాగస్వామ్యం అయ్యారని ఆ నిర్మాణ సంస్థతో కలిసి సినిమాలు నిర్మించబోతున్నారని తెలుస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి పవన్ కళ్యాణ్ తో ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈయన నటించిన బ్రో సినిమాకి నిర్మాతలుగా పీపుల్ మీడియా వారు వ్యవహరించారు అంతేకాకుండా పీపుల్ మీడియా వారికి నాదెండ్ల మనోహర్ కు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది ఈ క్రమంలోనే రేణు దేశాయికి కూడా పీపుల్ మీడియా వారితో మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలోనే ఈమె వారితో కలిసి సినిమాలను నిర్మించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇలా వీరితో ఇప్పటికే పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నటువంటి (Renu Desai) రేణు దేశాయ్ త్వరలోనే సరికొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది.మరి నిర్మాతగా రేణు దేశాయ్ ఎలాంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈమె నిర్మాతగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus