ఓ మంచి తండ్రి హంతకుడు ఎలా అయ్యాడు?

  • July 28, 2020 / 10:09 AM IST

రెండేళ్ల క్రితం తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఓ పరువు హత్య సంచలనం రేపింది. ఉన్నత కుటుంబానికి చెందిన ఓ యువతి దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవడం ఓ దారుణ హత్యకు కారణం అయ్యింది. ఓ తండ్రి కూతురు భర్తను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా చంపించారు. రాష్ట్రంలో ఆ మర్డర్ పెద్ద దుమారానికి దారితీసింది. కొన్నాళ్ళు మీడియా అటెంషన్ మొత్తం ఈ కేసుపైనే సాగింది. హత్యకు గురైంది దళిత యువకుడు కావడంతో మరిన్ని గొడవలు జరిగాయి.

కాగా ఇదే సంఘటన స్పూర్తితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మర్డర్ పేరుతో మూవీ ప్రకటించారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. సొసైటీలో పేరు, ప్రతిష్ట, హోదా ఉన్న ఓ తండ్రి తన ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. తండ్రి ఎంత ప్రేమ చూపించినా వయసు ప్రభావం ఆ అమ్మాయిని ఓ యువకుడి ప్రేమలో పడేలా చేస్తుంది. దానితో రహస్య వివాహం కాపురం లాంటివి జరిగిపోతాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు దూరమైందన్న వేదన ఒక వైపు, సమాజంలో పరువు పోయిందే కోపం మరో వైపు.

కూతురు ప్రేమకు-ఆయన పరువుకు మధ్యలో నలిగిపోయిన ఓ తండ్రి మానసిక క్షోభే మర్డర్ మూవీ అని తెలుస్తుంది. ముఖ్యంగా ఆ పెళ్లి వలన ఆ కుటుంబంలో ఏర్పడిన అశాంతి, వేదన వంటి విషయాలు మూవీలో హైలెట్ చేసినట్లున్నారు. ఓ మంచి తండ్రి ఏ కారణంతో హంతకు అయ్యాడు వంటి విషయాలు చర్చించారు అన్పిస్తుంది. ఆద్యంతం సీరియస్ నోట్ లో సాగిన మర్డర్ ట్రైలర్ ఆసక్తి రేపుతుంది. ఈ కథ అందరికీ తెలిసినా, అంతర్గతంగా ఏమి జరిగింది అనేది ఆసక్తి గొలిపే అంశం. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించగా త్వరలో విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus