కొత్త అనుమానాలకు తావిస్తోన్న రియా ఫోన్ రికార్డ్స్!

  • August 12, 2020 / 07:37 PM IST

ఆల్రెడీ సుశాంత్ ఆత్మహత్య కేసు రకరకాల పొంతలు తొక్కుతోంది. తాజాగా ఈ కేసులో రానా, రకుల్ పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ కేసులో వీళ్ళ యాక్టివిటీ ఏమీ లేనప్పటికీ.. రియా చక్రవర్తి సుశాంత్ ఆత్మహత్య అనంతరం రానాకు ఏడు సార్లు, రకుల్ కి ఏకంగా 30 సార్లు ఫోన్ చేసిందట. ఆ ఫోన్ ను వాళ్ళు ఆన్సర్ చేయలేదనుకోండి అది వేరే విషయం. టాలీవుడ్ కి చాన్నాళ్ల క్రితమే దూరమైపోయింది రియా చక్రవర్తికి అసలు వీళ్లిద్దరికీ కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది.

కనీసం రానా-రియా-రకుల్ కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్దగా లేవు. అలాంటిది ఆమె అసలు వీళ్ళను ఎందుకు కాంటాక్ట్ అవ్వాలనుకుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అసలే రీసెంట్ గా పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన రానా పేరు ఈ కేసులో వినిపించడం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు పెద్దగా నచ్చడం లేదు. ముఖ్యంగా రకుల్ కి ఏకంగా 30సార్లు ఫోన్ చేయడం, ఆమె ఆన్సర్ చేయకపోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళిద్దరికే కాల్ చేయాల్సిన అవసరం రియాకు ఎందుకు వచ్చింది అనే కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగుతోంది.

ఇకపోతే.. సుశాంత్ కేస్ విషయంలో రియా నుంచి ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ స్వాధీనపరుచుకున్న సి.బి.ఐకు కొన్ని నమ్మలేని విషయాలు తెలిశాయట. ఇండస్ట్రీలోని చాలా సీక్రెట్స్ ఈ ఎంక్వైరీలో బయటపడే అవకాశాలున్నాయని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. మరి ఆ సీక్రెట్స్ ఏమిటి అనే విషయం పక్కన పెడితే.. రానా, రకుల్ పేర్లు త్వరగా ఈ రొచ్చు నుండి బయటపడితే బాగుండు.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus