RP Patnaik: ”ఆ నేరస్థుడ్ని పట్టిస్తే రూ.50 వేలు ఇస్తా”

  • September 15, 2021 / 05:16 PM IST

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. నిందితుడు రాజుని పట్టించడంతో పోలీసులకు సహకరిద్దాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ సోమవారం బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. హీరో నాని సైతం ‘బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు’ అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ఫీ పట్నాయక్ సైతం సైదాబాద్ ఘటనపై స్పందిస్తూ..

నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి కలుగుతుందని ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ”చిట్టితల్లి కి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మ శాంతించాలంటే, ఈ పల్లకొండ రాజు దొరకాలి. హైద్రాబాద్ సిటీ పోలీస్ విడుదల చేసిన ఈ ఆధారాల ద్వారా ఈ నిందితుడిని పట్టుకున్న వారికి 10 లక్షలు రివార్డ్ ప్రకటించారు. నా వంతుగా ఆ పట్టించిన వారికి 50,000 ఇస్తాను.

కానీ ఇతను దొరకాలి.. పోలీసులు ఇచ్చిన అన్ని క్లూస్ మనకి హెల్ప్ కావొచ్చు, కాకపోవచ్చు కానీ చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతన్ని పట్టించేలా చేస్తుంది. అతను మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ నేరస్థుడ్ని పట్టుకునే పనిలో మనం కూడా సహకరిద్దాం” అంటూ రాసుకొచ్చారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus