Sai Dharam Tej: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న రిపబ్లిక్ మూవీ!

  • November 2, 2021 / 04:11 PM IST

యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ గత నెల 1వ తేదీన థియేటర్లలో విడుదలై బిలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సీరియస్ మూవీ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాతో అటు సాయితేజ్ ఇటు దేవా కట్టా ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఈ నెల 26వ తేదీ నుంచి రిపబ్లిక్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలో జీ5 నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన రానుందని సమాచారం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ రిపబ్లిక్ మూవీకి సంగీతం అందించగా సాయితేజ్ కు జోడీగా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటించారు. వెండితెరపై సక్సెస్ సాధించని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాను జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

మరోవైపు సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది వినాయక చవితి పండుగ రోజున రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే సాయితేజ్ పూర్తిగా కోలుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో సాయితేజ్ కొత్త సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటారని సమాచారం అందుతోంది. రిపబ్లిక్ మూవీ థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు ఓటీటీలో అందుబాటులోకి రానుండటం గమనార్హం. వరుస హిట్ల తరువాత రిపబ్లిక్ మూవీతో సాయితేజ్ ఖాతాలో ఫ్లాప్ చేరింది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus