నిర్మాతలకు షాక్ ఇచ్చిన ‘ఫిదా’ బ్యూటీ…!

  • April 28, 2020 / 07:40 PM IST

‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ నే డామినేట్ చేసేంతలా ఆమె నటించింది. ఆ తరువాత ‘ఎం.సి.ఏ’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి .. తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. తమిళంలో కూడా ఈ బ్యూటీ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. యూత్ ఈమె నటనకి అంత ఫిదా అయిపోయారు.

ఇదిలా ఉంటే… ఈమె నటించిన ‘కణం’ ‘ఎన్జీకె’ ‘మారి2’ వంటి చిత్రాలు పెద్దగా ఆడకపోయినా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. యూత్ లో ఈమెకు గల క్రేజ్ వల్ల ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ సాయి పల్లవి ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసింది. ‘డియర్ కామ్రేడ్’ లో ఎక్కువ లిప్ లాక్ ఉన్నాయని… ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత లేదు అని ఆమె రిజెక్ట్ చేసిందట.

అసలే ఈ బ్యూటీకి యాటిట్యూడ్ ఎక్కువ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దర్శక నిర్మాతలు ఈమె దగ్గరకు కథ తీసుకు వెళ్ళడానికే భయపడుతూ ఉంటారట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈమె తన పారితోషికాన్ని ఏకంగా 1.4 కోట్లు చేసేసింది అని వార్తలు వస్తున్నాయి. అంటే ఈమె స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని ఈ డైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తున్నట్టు కొందరు భావిస్తున్నారు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus