సంతానంకి ఓకే చెప్పిన సాయి పల్లవి

  • August 28, 2017 / 12:00 PM IST

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తో నటించాలని పెద్ద పెద్ద హీరోలు కోరుకుంటుంటే.. ఆమె మాత్రం కమెడియన్ అయిన సంతానంతో కలిసి కలిసి స్టెప్పులు వేయడానికి ఒకే చెప్పింది. మలయాళ  ప్రేమమ్‌ చిత్రంతో  మాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే మలార్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొంచెం ఆలస్యమైనా టాలీవుడ్ లో ఫిదాతో పరిచయమైంది. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఎన్నో అవకాశాలు తలుపు తట్టినా వాటిని పక్కన పెట్టిన తనకు నచ్చిన రెండు కథలను ఎంచుకుంది. అలాగే   తమిళంలో  విజయ్‌ దర్శకత్వంలో కరు చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంటర్ కాబోతోంది. ఈ చిత్రం రిలీజ్ కాకముందే మరో తమిళ చిత్రానికి సైన్ చేసింది.

ఎం.రాజేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోగా సంతానం నటించనున్నారు. కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సంతానం హీరోగాను సక్సస్ అందుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న సాయి పల్లవి సంతానంతో నటించడాన్నికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తరవాత స్టార్ హీరోలు ఆమెను తమ పక్కన నటించడానికి ఇష్టపడరని హెచ్చరిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus