తెలుగుతో పాటు తమిళ్‌ కూడా సందడి చేయనున్న సాయి పల్లవి!

  • September 29, 2017 / 10:27 AM IST

‘ఫిదా’లో భానుమతిగా సాయి పల్లవి చేసిన సందడి టాలీవుడ్ ఆడియన్స్ ఇప్పట్లో మర్చిపోలేరు.. అందం, అభినయంతో అందర్నీ ఫిదా చేసేసిన సాయి పల్లవి ఇప్పుడు బిజీ స్టార్‌ అయిపోయింది. ప్రస్తుతం నాని సరసన ‘ఎంసిఎ’లో నటిస్తోన్న ఈ బ్యూటీ, ఓ సినిమా ఒప్పుకోవడంలో తన పాత్రకు తగిన ప్రాధాన్యతను మాత్రమే పరిశీలించే సాయి పల్లవి.. ఇప్పుడు తమిళ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టుకు ఎంపికైంది.

ధనుష్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘మారి’ ఒకటి. ప్రస్తుతం ‘మారి–2’కి శ్రీకారం చుట్టారు. ఇందులో ధనుష్‌ సరసన సాయి పల్లవి కథానాయికగా నటించనున్నారు. మారి2 మూవీలో లీడ్ హీరోయిన్ పాత్రను ఈ ప్రేమమ్ బ్యూటీ చేయబోతోందని.. సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. బాలాజీ మోహన్ దర్శకత్వంలో మారి చిత్రం రూపొందగా.. ఇప్పుడు అదే దర్శకుడు సీక్వెల్ ను కూడా రూపొందించబోతున్నాడు. హీరో ధనుష్ స్వయంగా ఈ మూవీ నిర్మించనున్నాడు.. మారి చిత్రం తెలుగులో మాస్ పేరుతో రిలీజ్ అయి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇప్పుడు టాలీవుడ్ లో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ ను బేస్ చేసుకుని.. తెలుగులో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus