సాయిరామ్ శంక‌ర్ ‘రిసౌండ్’ చిత్రం షూటింగ్ పునఃప్రారంభం

  • November 16, 2020 / 05:02 PM IST

హీరో సాయిరామ్ శంక‌ర్ ఒక‌ ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సాయిరామ్ శంక‌ర్ స‌ర‌స‌న నాయిక‌గా రాశీ సింగ్ న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘రిసౌండ్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ టైటిల్ విన‌గానే మాసీగా ఉండి, ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం పునఃప్రారంభ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కూ 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తాజాగా ప్రారంభ‌మైన షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ‘రిసౌండ్’ మూవీని సురేష్ రెడ్డి, అయ్య‌ప్ప‌రాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. సాయిప్ర‌కాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, స్వీకార్ అగ‌స్తి సంగీత బాణీలు స‌మ‌కూరుస్తున్నారు.

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus