స్కూల్ కి గుడ్ బై చెప్పేసిన హీరోయిన్

  • September 16, 2016 / 07:24 AM IST

చిన్న వయసులో వెండితెరపైకి వచ్చి హీరోయిన్ గా బిజీ అయిపోయిన భామామణులు బోలెడంతమంది ఉన్నారు. శ్రీదేవి, రమ్యకృష్ణ నుండి నివేద థామస్ వరకు ఎందరో చిరు ప్రాయంలోనే వెండితెరకు కొత్త సొభగులద్దారు. అయితే తద్వారా చాలామంది వారి విద్యార్ధి జీవితానికి సగంలోనే స్వస్తి పలికారు. అయితే నేటితరం వారు మాత్రం జంట పడవల ప్రయాణం చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇదే బాటలో నడిచేందుకు నిర్ణయించుకుందట.ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన మరాఠీ చిత్రం ‘సైరత్’తో అందరి దృష్టినీ ఆకర్షించింది రింకు రాజ్ గురు.

ఈ సినిమా విడుదలకు ముందు ఆమె ఎవరన్నది కుటుంబ సభ్యులకు, బంధువవులకు, స్నేహితులకు మాత్రమే తెలుసు. తీరా సినిమా విడుదలై, చిన్న సినిమా కాస్త పెద్ద మొత్తాల్లో కలెక్షన్లు రాబట్టింది. ఈ విజయంతో అందరికీ పరిచితురాలైంది రింకు. ఈ సినిమా షూటింగ్ జరిగేనాటికి తాను తొమ్మిదో తరగతి చదువుతుంది. ఈ సినిమా ఆడిన థియేటర్లకు జనాలు ఎలా క్యూ కట్టారో ఇప్పుడు రింకు చదివే ఆ పాఠశాలకి అదే రీతిన జనాలు క్యూ కడుతున్నారట. దీంతో పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న రింకు ప్రైవేట్ గా చదవాలని నిశ్చయించుకుంది. దీనికి తోడు ఆమెకు సినిమా ఆఫర్స్ సైతం అదే స్థాయిలో వస్తున్నాయట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus