Samantha: నెట్టింట వైరల్ అవుతున్న సమంత షాకింగ్ పోస్ట్!

  • October 27, 2021 / 06:55 PM IST

స్టార్ హీరోయిన్ సమంత తనపై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్లగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్ గురించి చర్చ జరుగుతోంది. తాజాగా సమంత కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడవద్దని చేసిన పోస్ట్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇటీవల సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఛార్ ధామ్ యాత్రకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.

సమంత ఛార్ ధామ్ యాత్రకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సమంత తాజా పోస్ట్ లో మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారో అని కంగారు పడవద్దని పేర్కొన్నారు. కూతురు పెళ్లి కోసం డబ్బు ఆదా చేయడానికి బదులుగా చదువు కోసం ఖర్చు చేయాలని సమంత చెప్పుకొచ్చారు. కూతురిని పెళ్లికి సిద్ధం చేయడం కంటే ముందు తనని సమర్థంగా తీర్చిదిద్దాలని సమంత పేర్కొన్నారు. కూతురికి ఆత్మవిశ్వాసంతో ఉండటం, తనను తాను ప్రేమించుకోవడం నేర్పాలని సమంత వెల్లడించారు.

ఇతరులకు అవసరం ఉన్న సమయంలో కూతురిని మార్గదర్శకంగా ఉండే విధంగా సిద్ధం చేయాలని సమంత కోరారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తన మనస్సులోని భావాలను పోస్టుల ద్వారా వెల్లడిస్తున్నారు. త్వరలో సమంత కొత్త సినిమాల షూటింగ్ మొదలుకానుండగా షూటింగ్ లతో సమంత బిజీ కానున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus