పసి పిల్లల ప్రాణాలు కాపాడిన సమంత!

  • November 4, 2017 / 09:13 AM IST

సమంత మాత్రమే కాదు.. ఆమె మనసు అందమైనదని గతంలో అనేకసార్లు చాటుకుంది. తాజాగా మరో సారి  తన మానవత్వం బయటపడింది. స్టార్ గా మారినప్పటి నుంచి ప్రత్యూష ఫౌండేషన్ కి పరోక్షంగా, ప్రత్యక్షంగా సేవలు అందిస్తోంది. పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయం చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. రీసెంట్ గా ప్రాణాపాయంలో ఉన్న 15 మంది పసి పిల్లలకు తన ప్రత్యూష స్వచ్ఛంద సంస్థ ద్వారా శస్త్రచికిత్స చేయించి ఆ చిన్నారులకు పునర్జన్మను కలిగించింది. ఇందుకు కోటికి పైనే ఖర్చు అయ్యిందని సమాచారం. పెట్టిన ఖర్చును చెప్పుకోవడానికి సమంత ముందుకు రాలేదు. కానీ ఆపరేషన్ జరిగిన పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. “చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారు.

దేవునికి ధన్యవాదాలు” అని ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఆమె మంచి మనసు తెలుసుకొని మరింతమంది అభిమానులు అయిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటి కోడలయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ తో కలిసి రంగస్థలం 1985 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus