శాటిలైట్ & డిజిటల్ రైట్స్ తో మహేష్ న్యూ రికార్డ్

  • February 3, 2021 / 01:55 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతిని అనుకోని విధంగా మిస్ అయ్యాడు. కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం మిస్సయ్యే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చేసింది. సర్కారు వారి పాట 2022 పొంగల్ భరిలో నిలవబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే మహేష్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియెన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఇక సినిమా శాటిలైట్ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. గతంలో సైరా (32కోట్లు) సినిమానే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రాఫిట్స్ ను అందిస్తోంది ఈ సినిమా. సర్కారు వారి పాట డిజిటల్ శాటిలైట్ రైట్స్ రెండు కలిపి రూ.35కోట్ల ధర పలికినట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మార్గంలో అత్యదిక ధర పలికించిన సినిమాగా SVP నిలవడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా అంచనాల డోస్ పెరిగింది.

చూస్తుంటే మహేష్ ఈ సారి బాక్సాఫీస్ వద్ద ఒక న్యూ వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus