నా భర్తని చూస్తుంటే బాధగా ఉంది అంటున్న అఖిల్ హీరోయిన్!

  • March 5, 2020 / 01:23 PM IST

అక్కినేని అఖిల్ నటించిన ‘అఖిల్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయేషా సైగల్. మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెకి ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. కొన్నాళ్లకే హీరో ఆర్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరూ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఆర్య తన కొత్త సినిమా కోసం జిమ్ కి వెళ్తూ బాగా కండలు పెంచుతున్నాడు. ఇటీవల అతడి లుక్ బయటకొచ్చింది.

అయితే తన భర్త రోజూ జిమ్ లో కష్టపడుతుంటే చూడలేకపోతున్నానని అంటోంది ఆర్య భార్య సాయేషా సైగల్. ఆర్య జిమ్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘నా భర్తను ఇలా చూసి బాధతో తట్టుకోలేకపోతున్నా. ఆయన్ని చూసి గర్విస్తున్నాను’ అంటూ కామెంట్ చేసింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్య బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసమే ఆర్య ఎక్కువ సమయంలో జిమ్ లో గడుపుతున్నాడు


‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus