జనతా గ్యారేజ్ లో కలిసిన అదనపు సీన్లు

ఈ ఏడాది విదులై, విజయం సాధించిన చిత్రాల్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న జనతా గ్యారేజ్ కి తాజాగా కొన్ని సీన్లు కలిసాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పోటీ పడి నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. అభిమానుల నుంచి వస్తున్న స్పందనకు సంతోషంతో డైరక్టర్ కొరటాల శివ సినిమాకు కొత్త సన్నివేశాలను జత చేశారు.

ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ పాటతో ఉంటుంది. ఆ పాటకు ముందు మొక్కల గురించి తారక్ చెప్పే సీన్ ని యాడ్ చేశారు. చిత్ర నిడివి పెరిగిన కారణం గా తొలగించిన ఎన్టీఆర్, సమంత ల మధ్య ఉండే సీన్లను ఇప్పుడు కలిపారు. ఈ యాడింగ్ కలెక్షన్లను పెంచేందుకు దోహదం చేస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. గతంలో కొరటాల శివ మిర్చి సినిమాకు కూడా ఇలాగే చేసి వసూళ్లను పెంచాడు. ఆ చిత్రంలో వర్షం ఫైట్ ని  మూడు వారాల తర్వాత యాడ్ చేసి సెన్సేషన్ సృష్టించాడు. జనతా గ్యారేజ్ విషయంలోనూ ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని శివ భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus