ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజైన మే23న సంద‌డి చేయ‌నున్న`పెళ్లిసంద‌D` రెండ‌వ‌పాట‌

  • May 19, 2021 / 02:06 PM IST

శతాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు, క్లాస్‌ని, మాస్‌ని, ఫ్యామిలీస్‌ని, భ‌క్త‌జ‌న‌కోటిని అల‌రించిన ఎన్నో అపూర్వ చిత్రాల‌ని అందించిన ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజు మే23. ఈ విశిష్ట‌మైన రోజున ద‌ర్శ‌కేంద్రుడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న‌`పెళ్లి సంద‌D` చిత్రంలోని రెండ‌వ‌పాట విడుద‌ల‌కానుంది. ఏప్రిల్ 28న విడుద‌లైన `పెళ్లిసంద‌D` చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ `ప్రేమంటే ఏంటి..` శ్రోత‌ల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో దాదాపుగా 4 మిలియ‌న్ల ఆర్గానిక్ ప్యూస్‌ సాధించి రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల కాంభినేష‌న్‌లో మ‌రో సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రంలోని రెండ‌వ‌పాట ద‌ర్శ‌కేంద్రుడి పుట్టిన‌రోజునాడు విడుద‌ల‌వ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా…

ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ – “ రాఘ‌వేంద్ర‌రావుగారు మ‌రియు కీర‌వాణిగారి కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్ర‌తి పాట త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. డైరెక్ట‌ర్‌గా నాకు ఇదొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సినిమా చాలా బాగా వ‌స్తోంది“ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాయిబాబా కోవెల‌మూడి మాట్లాడుతూ – “ ఏడు రోజులు ప్యాచ్‌వ‌ర్క్ మిన‌హా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ తీసేశాక బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసి జూన్‌, జులైలో మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాం“ అన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus