Guppedantha Manasu August 9th: విశ్వనాథం ఏంజెల్ కి గతం చెప్పేసిన వసుధార!

  • August 9, 2023 / 12:27 PM IST

బుల్లితెర ప్రేక్షకులను రోజురోజుకు ఆకట్టుకుంటూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే.. రౌడీల ఫోన్ కి శైలేందర్ ఫోన్ చేయడంతో ఆ ఫోన్ చేసినది శైలేంద్ర అని చెప్పిన రిషి నమ్మడు దానికి సాక్షాలు చూపిస్తానని చెప్పగా అప్పుడు కూడా నాపై అభియోగం మోపినందుకు సాక్షాలు చూపించారు కదా అంటూ రిషి మాట్లాడతారు. అంతలోపు ఎస్ఐ వసుధారణను మేడం అంటూ గట్టిగా పిలవడంతో వసుధార భ్రమ నుంచి బయటకు వస్తుంది.

ఒకవేళ నేను నిజం చెప్పిన రిషి సార్ అనే మాటలు ఇవే కదా అని అనుకుంటుంది అంతలోపు రీషి వచ్చి ఏం జరిగింది అనడంతో ఫోన్ చేసిన వ్యక్తి వాయిస్ మేడం గుర్తుపట్టినట్లు ఉన్నారు. అనడంతో అది ఎవరి వాయిస్ ఓ విన్నట్టు ఉంది కానీ గుర్తు రావడంలేదని వస్తుందా. మరోవైపు శైలేంద్ర మరోసారి తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా ప్రెస్టేజ్ అవుతూ ఉంటారు. వీడిని లేపేయాలని ప్లాన్ చేస్తున్న అసలు పని జరగడం లేదు వీడు ఇప్పుడే నాకు ఇలా చెమటలు పట్టిస్తున్నాడు అంటే నిజం తెలిసిన తర్వాత నా పరిస్థితి ఏంటో అని శైలేంద్ర కంగారు పడుతూ ఉంటారు.

వాడికి నిజం తెలిసేలోపు వాడిని లేపేయాలి అని అనుకుంటాడు. మరోవైపు వసుధార రిషికి మెసేజ్ చేస్తుంది తాను మాట్లాడాలి అని చెప్పడంతో రిషి తాను క్లాసులో ఉన్నానని మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు కాదు క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడాలి చాలా అర్జెంట్ ఇది మీ గురించే అంటూ వసుధార చెప్పినప్పటికీ రిషి మాత్రం నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదనుకుంటాడు.ఇక రిషి ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా వసుధార పిలుస్తున్నప్పటికీ పట్టించుకోదు దాంతో వసుధార కోపంగా విశ్వనాథం ఇంటికి వెళ్లి గట్టిగా రిషిని పిలుస్తూ కేకలు వేస్తుంది.

ఎందుకు అలా పిలుస్తున్నావు అని రిషి అడగడంతో నేను మీతో మాట్లాడాలి అని చెప్పాను కదా అయినా ఏంటి మాట్లాడకుండా అలా వచ్చేసారు అంటూ విశ్వనాథం ఏంజెల్ చూస్తుండగానే గట్టిగ రిషి పై అరుస్తుంది.అయినా నువ్వు నాపై ఇలా అజమాయిషి చేయడం ఏమాత్రం బాగాలేదు ఏ హక్కుతో నువ్వు నాపై ఇలా అరుస్తున్నావు అని రిషి అనడంతో మన మధ్య ఎలాంటి బంధం లేదా ఏ హక్కుతో మిమ్మల్ని మాట్లాడుతున్నానా అంటూ ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తుంది. వసుధర ఇలా చూపించడంతో విశ్వనాథం అదేంటి అని అడగగా ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్ .మా ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది.

అంటూ వసుధార చెప్పడంతో ఏంజెల్ విశ్వనాథం షాక్ అవుతారు.దీంతో ఒక్కసారిగా రిషి భ్రమలో నుంచి బయటకు వచ్చి కారు ఆపుతారు. ఇదంతా నా బ్రాహ్మణ ఒకవేళ నేను తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే వారి ముందు వచ్చి నిజంగానే మా గతం గురించి చెప్పేస్తుంది అని రీషి తనతో మాట్లాడటానికి వెళ్తారు. నేరుగా చక్రపాణి ఇంటికి వెళ్లడంతో వసుధార చక్రపాణి ఇద్దరు షాక్ అవుతారు. మన గతం గురించి తెలియని వారి ముందు మాట్లాడటం కన్నా తెలిసిన వారి దగ్గర మాట్లాడటం మంచిదని ఇక్కడికి వచ్చానని రిషి చెబుతాడు.

ఇంతకీ నాతో ఏం మాట్లాడాలి అని రిషి అడగడంతో మహేంద్ర సార్ నాకు ఫోన్ చేశారు ఆయన మీ గురించే కంగారు పడుతున్నారు అంటూ వసుధార చెప్పడంతో ఆ ఫోన్ ఏదో నాకే చేయొచ్చు కదా నీకు చేయడం ఏంటి అని రిషి మాట్లాడుతారు.బాధలో ఉన్నవారికి ఓదార్పు కావాలి సర్ వాళ్లు మీకు ఫోన్ చేస్తే మీరు చిరాకు పడతారని నాకు ఫోన్ చేసి ఉంటారు ఆయన మీరు నేను వేరు కాదు కదా అంటూ వసుధార మాట్లాడుతుంది ఇంతటితో (Guppedantha Manasu ) ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus