RC15: చరణ్- శంకర్ ల మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • November 22, 2021 / 07:17 PM IST

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్టు ఇది వరకే ప్రకటించాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందుతోన్న 50వ చిత్రమిది. ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. సినిమాలో కేవలం 7 నిమిషాల నిడివికి సంబంధించిన షెడ్యూల్ అదని తెలుస్తుంది.

దాని కోసమే భారీగా రూ.67 కోట్లు ఖర్చయ్యిందట. ఇక రెండో షెడ్యూల్ కు కూడా రంగం సిద్ధమైంది. దాని కోసం రూ.45 కోట్ల బడ్జెట్ తో ఓ సెట్ వేసారట. ఈ షెడ్యూల్ లో రాంచరణ్ హీరోయిన్ కియారా అద్వానీ ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట. అలాగే ఓ పాట కూడా చిత్రీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రెండు షెడ్యూల్స్ కే రూ.112 కోట్ల వరకు వరకు ఖర్చు అవుతుంది. ఇక సినిమా లాంచ్ ఈవెంట్ కోసం మరో రూ.1.73 కోట్లు ఖర్చయ్యింది.

దాంతో కూడా కలుపుకుంటే రూ.113.73కోట్ల వరకు ఖర్చు అవుతుంది. రెండు షెడ్యూల్స్ కే ఇంత ఖర్చు అయితే ఇక సినిమా పూర్తయ్యేసరికి ఇంకెంత ఖర్చు అవుతుందో..! పైగా ఈ చిత్రం కూడా ఓ సోషల్ ఎలిమెంట్ తో రూపొందుతుంది తప్ప ‘రోబో'(సిరీస్) లాగా సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా కాదు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus