మళ్ళీ ట్రోలింగ్ కు గురైన అనసూయ

  • July 8, 2020 / 12:12 PM IST

‘జబర్దస్త్’ యాంకర్ గా హాట్ హాట్ డ్రెస్సులతో కుర్రకారు మనసులు దోచింది అనసూయ భరద్వాజ్. అసలు ఎవరు ఈ కుర్ర యాంకర్ మరీ ఇంత హాట్ గా ఉంది అనుకున్న కుర్రకారు ఆలోచిస్తుండగా.. అనసూయకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని తెలిసినప్పుడు చాలా మంది షాకయ్యారు. అంతలా ఆమె అందాన్ని మెయిన్టైన్ చేస్తుంటుంది. సినిమాల్లో కూడా తనకు తగ్గ క్యారెక్టర్లను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది ఈ హాట్ యాంకర్. ఇక తన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ కి సంబందించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

తాజాగా అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో ఉన్న పిక్ ను అప్లోడ్ చేసింది. అయితే అందులో వింతేముంది అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే ఈ ఫొటోలో తన భర్త నెక్ కు మసాజ్ చేస్తుంది. ఇందులో కూడా తప్పు ఏమాత్రం లేదు. అయితే ఆ ఫొటోలో అనసూయ షర్ట్ వేసుకుంది కానీ కింద మాత్రం ఏమీ వేసుకున్నట్టు లేదు. ఇప్పుడు ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటో తన కొడుకె తీసినట్లు ఆమె ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోని చూస్తున్న కొందరు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తుండగా.. మరికొంత మంది అనసూయను వెనుకేసుకొస్తున్నారు. ‘అర్ధనగ్నంగా ఉన్న పర్సనల్ ఫోటీని సోషల్ మీడియాలో పెట్టడమేంటి’ అని కొంతమంది అంటుంటే… ‘ఆమె ఇంట్లో ఆమె ఎలగైనా ఉండొచ్చు’ అంటూ మరికొందరు అనసూయకు మద్దతు పలుకుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus