Udaya Bhanu: చాలా కాలం తర్వాత ట్రోలింగ్ తో హైలెట్ అవుతున్న ఉదయభాను.. వీడియో వైరల్.!

  • December 16, 2023 / 07:49 PM IST

ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను అందరికీ సుపరిచితమే.’వన్స్ మోర్ ప్లీజ్’ ‘సాహసం చేయరా డింభకా’ ‘జాణవులే నెరజాణవులే’ వంటి గేమ్ షోలతో బుల్లితెర పై సెన్సేషన్ క్రియేట్ చేసింది ఉదయభాను. యాంకర్లు గ్లామర్ షో కూడా చేయగలరు అనే ట్రెండ్ ని స్టార్ట్ చేసింది ఉదయభాను అనే చెప్పాలి..! అంతేకాదు ఈమె క్రేజ్ ను చూసి షాకయ్యి.. భారీ పారితోషికం చెల్లించడానికి కూడా టీవీ ఛానల్స్ ఎగబడ్డాయి. మరోపక్క అప్పుడప్పుడే సినిమాల్లో కూడా బిజీ అవుతుంది అనుకున్న టైంలో ఆమెకు ఊహించని విధంగా బ్రేకింగ్ పాయింట్ ఎదురైంది.

ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కెరీర్లో గ్యాప్ వచ్చింది. తర్వాత అంతా సెట్ అయ్యింది అనుకున్న టైంలో పోటీలో రాణించలేక సైలెంట్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ కి కూడా పెద్దగా బూస్టప్ అందలేదు. అప్పుడప్పుడు మాత్రమే ఆమె టీవీ షోలలో, సినిమా వేడుకల్లో కనిపిస్తుంది. అయినా చాలా మంది ఉదయభానుని మర్చిపోయారు అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ఈ మధ్య ఊహించని విధంగా ఆమె వంటల వీడియోలు చేస్తూ వస్తుంది. చాలా వీడియోలు చేసినప్పటికీ.. ఊహించని విధంగా ఇటీవల ఓ వీడియోతో ట్రోల్ అవుతుంది. ఆ రకంగా ఉదయభాను అందరికీ మరోసారి గుర్తొచ్చినట్టు అయ్యింది. ఇంతకీ ఉదయభానుని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే డౌట్ అందరికీ రావచ్చు.

ఆమె (Udaya Bhanu) లేటెస్ట్ వీడియోల్లో ‘పాలకూర పప్పు తయారీ విధానాన్ని వివరిస్తూ.. ఇవి భూమికి దగ్గరగా పెరుగుతాయి.. ఎత్తుగా పెరగవు.. దాని వల్ల ఇసుక ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా కడగకుండా వండితే ఆ ఇసుక మనలోకి చేరి రాళ్లు వస్తాయి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియోను షేర్ చేస్తూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus