కంటతడి పెట్టుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ

  • April 9, 2023 / 10:14 PM IST

విద్యుల్లేఖ రామన్ ..ఈమె అందరికీ సుపరిచితమే. నాని హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత ‘రన్ రాజా రన్’ ‘సరైనోడు’ ‘నిన్ను కోరి’ ‘రాజా ది గ్రేట్’ ‘తొలిప్రేమ’ ‘మహర్షి’ వంటి చిత్రాల్లో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది.విద్యుల్లేఖ.. ప్రముఖ తమిళ నటుడు మోహన్ రామన్ కుమార్తె అని బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు.

లెజెండరీ డైరెక్టర్ కె.బాలచందర్ గారు ఇష్టపడే నటుల్లో మోహన్ రామన్ కూడా ఒకరు. ఆయన వారసురాలు కావడం వల్లనే విద్యుల్లేఖ అంత మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఓ టీవీ షోలో విద్యుల్లేఖ రామన్ తన భర్తను అందరికీ పరిచయం చేసింది.ఇదే సమయంలో ఆమె పై జరిగిన ట్రోలింగ్ పై స్పందించి కంటతడి పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.తన పై జరిగిన ట్రోలింగ్, బాడీ షేమింగ్ గురించి విద్యుల్లేఖ రామన్ స్పందిస్తూ..

“నా పెళ్లైన కొత్తలో హనీమూన్ కి వెళ్ళినప్పుడు బికినీ వేసుకుంటే.. భయంకరంగా ట్రోల్స్ చేశారు. ‘ఏనుగు, పంది’ అంటూ ఇలా నోటికి ఏది వస్తే అది అన్నారు” అంటూ కంటతడి పెట్టుకుంది.ఈ క్రమంలో ఆ షోకి గెస్ట్ గా వచ్చిన కాజల్ విద్యుల్లేఖని ఓదార్చే ప్రయత్నం చేసింది. ‘నా ప్రెగ్నెన్సీ టైంలోనూ లావు ఎక్కానంటూ’ జనాలు నన్ను ట్రోల్ చేశారు.దయచేసి ఇలాంటి విషయాలు సీరియస్ గా తీసుకోవద్దు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus