Shruti Haasan, Pawan Kalyan: అలాంటి సంస్థను ప్రారంభిస్తానన్న శృతిహాసన్.. ఏం చెప్పారంటే?

  • April 8, 2023 / 04:23 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. సలార్ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటానని శృతి హాసన్ భావిస్తుండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. నేను హీరోల వయస్సును పట్టించుకోనని నేను నటినని శృతి హాసన్ కామెంట్లు చేశారు.
సీనియర్ హీరోలకు జోడీగా నటించడం గురించి కొంతమంది విమర్శలు చేశారని ఆమె అన్నారు.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కథలు నచ్చడం వల్ల నటించానని ఆమె చెప్పుకొచ్చారు. హీరోల వయస్సును పట్టించుకోకుండా ఆ సినిమాలలో నటించడంతో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో చేరాయని ఆమె అన్నారు. ప్రస్తుతం సలార్ సినిమాతో పాటు ది ఐ అనే సినిమాలో నటిస్తున్నానని శృతి హాసన్ పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ టేకింగ్ అదో పపంచంలా ఉంటుందని శృతి హాసన్ అన్నారు. కుర్రకారుకు డ్రీమ్ గర్ల్ అంటే హేమ మాలిని, శ్రీదేవి అని ఆమె చెప్పుకొచ్చారు.

లైఫ్ లో పెళ్లి అనేది భాగమని హిందీలో నా సినీ కెరీర్ మొదలైందని పవన్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో నా జాతకం మారిందని ఆమె కామెంట్లు చేశారు. మానసిక ఒత్తిడి సమస్యలతో బాధ పడేవాళ్లకు కౌన్సిలింగ్ అవసరం అని శృతి హాసన్ పేర్కొన్నారు. మా నాన్న బ్యానర్ లో తెరకెక్కే సినిమాలలో నటించే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వదులుకోనని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.

మానసిక ఒత్తిడితో బాధ పడేవాళ్లను కాపాడటానికి ఒక సంస్థను ప్రారంభించాలని అనుకున్నానని (Shruti Haasan) శృతి తెలిపారు. శృతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సినిమా సినిమాకు శృతి హాసన్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు శృతి హాసన్ తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus