Shyamala Devi: మనవడితో ఆడుకోవాలనే కోరిక తీరలేదు.. శ్యామలాదేవి కామెంట్స్ వైరల్!

  • October 11, 2023 / 12:37 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేయడంతో పాటు వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో నాలుగేళ్ల సమయం పడుతుంది. ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటుండగా ఆ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో తెలియాల్సి ఉంది. ఒకవైపు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తూనే మరోవైపు 200 కోట్ల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి (Shyamala Devi) తాజాగా మాట్లాడుతూ ఇంట్లో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు విగ్రహాన్ని చూసి ప్రభాస్ ఉలిక్కిపడ్డారని చెప్పారు. విగ్రహంను చూసిన వెంటనే ప్రభాస్ షాకయ్యారని విగ్రహం బాగుందని మెచ్చుకున్నాడని నిమిషం పాటు ప్రభాస్ ఏమీ మాట్లాడలేకపోయాడని ఆమె తెలిపారు. ప్రభాస్ మ్యారేజ్ చూడాలని మనవడు, మనవరాలితో ఆడుకోవాలనే కృష్ణంరాజు కోరిక తీరకుండానే ఆయన చనిపోయారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.

కృష్ణంరాజు విగ్రహం చూసిన తర్వాత ఆయన మా పక్కనే ఉన్నారన్న ఫీల్ కలిగిందని శ్యామలాదేవి అభిప్రాయం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని అందించిన ఫ్యాన్ ను ప్రభాస్ మెచ్చుకున్నారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ఈ విగ్రహంలో ఎంతో జీవకళ ఉందని శ్యామలాదేవి కామెంట్లు చేశారు. ప్రభాస్ ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

ప్రభాస్ రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ప్రభాస్ కు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పిఠాపురానికి చెందిన అభిమాని కృష్ణంరాజు విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా సలార్ ట్రైలర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus