మహేష్ కోసం విలన్ గా మారిన పవన్ దర్శకుడు!
- April 23, 2016 / 11:36 AM ISTByFilmy Focus
దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సుమారుగా వంద కోట్లతో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దర్శకుడు ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించనున్నాడు. ఈ విషయాన్ని ఎస్.జె.సూర్య కన్ఫర్మ్ చేసాడు.
ముందుగా విలన్ పాత్రను బాలీవుడ్ నటుడుతో చేయించాలనుకొన్నప్పటికీ.. ఎస్.జె.సూర్య అయియే బాగుంటుందని భావించారట. ఈ విషయం ఎస్.జె.సూర్యకు కూడా చెప్పినప్పుడు చాలా థ్రిల్ అయ్యాడట. వెంటనే చేయడానికి అంగీకరించాడట. ఇందులోనే కాకుండా తమిళంలో ధనుష్ హీరోగా చేసిన ‘ఇన్ని నొక్కి పాయుమ్ తోట’ సినిమాలో కూడా విలన్గా చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు సరసన నటించే కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











