తన మనసులోని బాధను బయటపెట్టిన సోనూ సూద్..!

Advertisement

2020 లో థియేటర్లు పెద్దగా రన్ అవ్వలేదు ..దీంతో స్టార్ హీరోలందరూ తమ బాక్సాఫీస్ స్టామినా చూపించే అవకాశం కూడా దక్కలేదు. కాబట్టి ఈ 2020ను తలుచుకోగానే స్టార్ హీరోలెవ్వరూ గుర్తుకురారు. కేవలం సోనూ సూద్ మాత్రమే గుర్తొస్తాడు అనడంలో సందేహం లేదు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. ఎంతో మంది వలస కూలీలు తమ గమ్య స్థలాలకు చేరుకోలేక.. అలాగే తినడానికి తిండి లేక అల్లాడుతుంటే.. వాళ్ళని ఆదుకుని వారి ఆకలి తీర్చి మరీ.. వారి గమ్యస్థలాలకు చేరుకునే ఏర్పాట్లు చేసాడు సోనూసూద్.

అంతేకాదు పేద రైతులకు ట్రాక్టర్లను కూడా ఉచితంగా ఇచ్చి.. మకుటం లేని మహారాజు అనిపించుకున్నాడు. సినిమాల్లో ఇతను విలనే కావచ్చు.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ఇదిలా ఉండగా.. సోనూ సూద్ ఓ విషయంలో బాగా హర్ట్ అయ్యాడట. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. “ఈ కోవిడ్ సిట్యుయేషన్లో కూడా ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు.

పవర్ ఫుల్ వ్యక్తులు మరింతగా తమ పవర్ ను పెంచుకున్నారు. కానీ పేదలు మాత్రం..మరింత నిరుపేదలయ్యారు. ఇదేం బాలేదు. ఈ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యాను. నాకు చాలా బాధగా ఉంది” అంటూ పేర్కొన్నాడు సోనూ సూద్.ఈ ట్వీట్ తో సమాజం గురించి అతను ఎంతగా ఆలోచిస్తాడో స్పష్టమవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus