భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్న జక్కన్న..!

  • February 5, 2021 / 06:27 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా ఎస్ ఎస్ రాజమౌళి చేస్తున్న ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ట్రిబుల్ ఆర్. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ కి వచ్చింది. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో నుంచీ ఇద్దరు హీరోలు రిలాక్స్ గా కనిపిస్తున్న ఫోటోని అఫీషియల్ గా ట్రిబుల్ ఆర్ టీమ్ షేర్ చేసింది. గత కొన్ని రోజులుగా క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హాయిగా కూర్చుని ఉన్న ఫోటోని షేర్ చేశారు. భారీ యాక్షన్ తో కూడిన క్లైమాక్స్ సీన్స్ లో ఎంతో కష్టపడి ఇప్పుడు కాస్త బ్రేక్ తీస్కున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకూ తీసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని, ఇది హిస్టరీలో ఒక మార్క్ సినిమాగా మిగిలిపోతుందని చెప్తోంది చిత్రయూనిట్. అంతేకాదు, భారీ యాక్షన్ సీన్స్ చూసిన తర్వాత ఎవ్వరైనా సరే సినిమాకి ఫిదా అయిపోతారట. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు చాలా రసవత్తరంగా ఉంటాయని అంటున్నారు.

ఇందులో అజయ్ దేవగన్, అలియాభట్, సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 400కోట్లకి పైగా ఖర్చుపెట్టి తీస్తున్న ఈసినిమా భారతీయ చలనచిత్ర రంగంలో చెరగని ముద్ర వేస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్తోంది చిత్రయూనిట్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus