ఒకప్పుడు ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన డిస్కో శాంతి (Disco Shanti) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తర్వాత ఆమె శ్రీహరిని (Srihari) ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే 2013 లో అనారోగ్య సమస్యలతో ఆయన మరణించిన సంగతి తెలిసిందే.
శ్రీహరి (Srihari) మరణం తర్వాత డిస్కో శాంతి డిప్రెషన్ కి గురయ్యారు. ఒకానొక టైంలో ఈమె తాగుడుకు కూడా బానిస అయిపోయింది. కానీ పిల్లల కోసం తిరిగి డిప్రెషన్ నుండి కోలుకున్నారు. ఇప్పుడు పిల్లలే తన సర్వస్వం అనేంతగా జీవిస్తున్నారు శాంతి. ఆమె అనుకున్నట్లే తన కుమారులను సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది. కానీ వాళ్ళు సరిగ్గా క్లిక్ అవ్వలేకపోతున్నారు.
‘రాజ్ ధూత్’ సినిమాతో మేఘాంశ్ చిన్న కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెద్ద కొడుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు టాక్ నడిచింది. ఇదిలా ఉంటే.. శ్రీహరి (Srihari) మరణించి 12 ఏళ్ళు పూర్తి కావస్తున్నా … శాంతి తన భర్త జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు. అందుకు గాను శ్రీహరి కట్టిన తాళి బొట్టును ఇప్పటికీ మెడలో వేసుకునే తిరుగుతున్నారు.
ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె మెడలో తాళిబొట్టు ఉండటంతో అంతా షాక్ అయ్యారు. దీనిపై ఆమె నేరుగానే స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘నా బావ (భర్త శ్రీహరి) (Srihari) ప్రేమతో కట్టిన తాళిబొట్టుని ఎప్పటికీ మెడలో వేసుకునే తిరుగుతాను. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. మా వాళ్ళు అయినా దీనిపై చేయి వేస్తే చంపేస్తాను’ అంటూ ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది.