ఫైర్ బ్రాండ్ హీరోయిన్ పై స్టార్ కిడ్ సెటైర్!

  • September 5, 2020 / 04:19 PM IST

రెండు నెలలుగా బాలీవుడ్ లో సుశాంత్ డెత్ కేసు ఆరని జ్వాలగా మండుతుంది. సుశాంత్ మరణం వలన ఎగసిన నిరసన ఉద్యమం కొందరు సెలెబ్రెటీలకు చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా స్టార్ కిడ్స్ అంటే ఒక వర్గం విరుచుకుపడుతున్నారు. సుశాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వలన స్టార్ హీరోయిన్ అలియా భట్ అందరికంటే ఎక్కువగా నష్టపోయింది. ఆమె ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయ్యింది. ఆమెతో సినిమా చేయాలంటేనే దర్శక నిర్మాతలు భయపడేలా ఆమె పట్ల వారి ప్రవర్తన ఉంది.

కాగా సుశాంత్ మరణం వలన ఏర్పడిన వ్యతిరేకతను మరింత ముందుకు తీసుకెళుతుంది హీరోయిన్ కంగనా రనౌత్. బాలీవుడ్ పెద్దలపై ఎప్పటి నుండో యుద్ధం చేస్తున్న కంగనా రనౌత్, మరింతగా రెచ్చిపోయి పోస్టులు పెడుతుంది. ఆమె సోషల్ మీడియా పోస్టులు వివాస్పదంగా ఉంటున్నాయి. కొందరు ఆమె సోషల్ మీడియా పోస్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐతే కంగనా ఎటువంటి కామెంట్ చేసినా సదరు వ్యక్తులు స్పందించడం లేదు. ఐతే అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ మాత్రం కంగనాపై పెద్ద సెటైర్ వేసింది.

కంగనాను ఆమె బురదలో పంది అంటూ ఎద్దేవా చేసింది. సోనమ్ సోషల్ మీడియాలో ‘బురదలో పందితో ఎప్పుడూ కుస్తీ పట్టకూడదు, దాని వలన మనకే బురద అంటుతుంది. దానికి బురద అంటే ఇష్టం’, అని కామెంట్ పెట్టారు. జార్జ్ బెర్నాడ్ షా చెప్పిన ఈ మాట చాలా కాలం క్రితమే నేర్చుకున్నాను అని సోనమ్ అన్నారు. ఇది పరోక్షంగా కంగనాను ఉద్దేశించి చేసినదే అని తెలుస్తుంది.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus