రాజకీయ కుట్రల పన్ని ఆ నటిని రోడ్డున పడేసారు అంటూ ఆవేదన..!

  • April 26, 2021 / 05:01 PM IST

సినిమాల్లో నటిస్తున్న వాళ్ళందరికీ భారీగా డబ్బులు ఉంటాయని.. వాళ్ళకు ఎటువంటి లోటు ఉండదని అంతా అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు.. వాళ్లకు కూడా లెక్కకు మించిన కష్టాలు ఉంటాయి. తాజాగా అద్దె కట్టలేని కారణంగా ఓ నటిని రోడ్డున పడేశారట .వివరాల్లోకి వెళితే.. టీనగర్‌ హబీబుల్లా సమీపంలోని ఓ సర్వీసు అపార్ట్‌మెంట్‌లో ప్రముఖ నటి విజయలక్ష్మి, ఆమె సోదరి ఉంటూ వస్తున్నారు. అయితే ఆమె సోదరి అనారోగ్యం పాలవ్వడంతో గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుంది.

గత శనివారం రాత్రి డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి తీసుకువచ్చిన తరుణంలో వారికి పెద్ద షాక్ తగిలింది. వారి ప్లాట్లో మరో వ్యక్తి ఉన్నాడట. దాంతో ఆమె మేనేజర్ విఘ్నేశ్వరన్‌ను సంప్రదించింది. దానికి ఆయన ‘3 నెలల నుండీ అద్దె చెల్లించనందున మీ సామాన్లు స్టోర్ రూమ్లో పెట్టినట్లు తెలిపారట. ఈ నేపథ్యంలో ఎటూ తోచక ఆమె మీడియాను ఆశ్రయించారట. అయితే ‘మేమేమి ఆమె సామాన్లు కావాలని బయట పడేయలేదని.. ఓ గదిలో పెట్టుంచామని…

నీ ఆమె ప్లాట్‌ సిబ్బంది శివను చెప్పుతో కొట్టడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు’ అపార్ట్మెంట్ మేనేజర్‌ విఘ్నేశ్వరన్‌ చెప్పుకొచ్చారు. ‘హరినాడర్‌ అన్నయ్య ఈమెను తీసుకువచ్చి ఇక్కడ పెట్టినట్టు ఆమె చెబుతుంది. కానీ అతనికి ఈ ప్లాట్‌కు ఎటువంటి సంబంధం లేదని, ఆమెను జావెద్‌ అనే వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని’ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు.వీటిలో ఎవరిది నిజం అనేది తెలియకు.. చివరికి తేనాంపేట పోలీసులు సర్దిచెప్పి విజయలక్ష్మిని వేరే ప్లాట్ కు చేర్చారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus