కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) .. అతని ప్రియురాలు కెనీషా ఫ్రాన్సిస్, అతని భార్య ఆర్తి రవి..ల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ వ్యవహారాన్ని వీరు రక్తికట్టించారు. ఓ వివాహ వేడుకలో కెనీషాతో రవి ప్రత్యక్షం కావడంతో మొదలైన ఈ రగడ అనేక మలుపులు తిరుగుతోంది. ఎప్పుడు ఎవరు ఏ బాంబు పేల్చుతారో తెలియక కోలీవుడ్ వర్గాలు, అభిమానులు ఉత్కంఠగా గమనిస్తున్నారు. జయం రవితో తన పేషెంట్ అని అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని తొలుత బుకాయించారు.
అలాంటిది జయం రవితో (Jayam Ravi) జంటగా కనిపించడం హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరి యవ్వారంపై మీడియాలో కథనాల నేపథ్యంలో రవి భార్య ఆర్తి రవి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. మూడో వ్యక్తి వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు మద్దతుగా ఆర్తి తల్లి సుజాత విజయ్ కుమార్ కూడా అల్లుడి పై ఆరోపణలు చేశారు. వీటికి జయం రవి, కెనీషాలు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
గతేడాది జయం రవి – ఆర్తి రవి..లు విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో ప్రస్తుతం చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరుగుతోంది. గత వారం జయం రవి, ఆర్తి రవి..లు కోర్టు ఎదుట హాజరై.. ఇకపై ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేదని జయం రవి న్యాయస్థానానికి తెలియజేశారు. రవి విడాకులు ఇచ్చేందుకే మొగ్గు చూపుతుండటంతో తనకు భరణం కింద నెలకు రూ.40 లక్షలు ఇప్పించాలని ఆర్తి కోర్టును కోరారు.
ఇంతలో ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. తనపై అత్యాచారం చేస్తామంటూ కొందరు అగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కెనీషా స్క్రీన్షాట్లు బయటపెట్టడం సంచలనం సృష్టించింది. దీనిపై సీరియస్ అయిన కెనీషా.. ఇలాంటి వారిని చట్టప్రకారం ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. కెనీషా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె టీమ్ హెచ్చరించింది. ఆ తరహా మెసేజ్లు పంపేవారి స్క్రీన్ షాట్ల ఆధారంగా చట్టపరంగా నోటీసులు పంపుతామని తెలిపింది.