‘తిత్లీ’ తుపాను బాధితులకు అండగా నిలుస్తున్న సినిమా స్టార్స్

  • October 15, 2018 / 01:24 PM IST

కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో “తిత్లీ” తుపాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రెండు జిల్లాల్లోని దాదాపు పన్నెండు మండలాల్లో “తిత్లీ” తీవ్ర నష్టం కలిగించింది. తుపాను ధాటికి ఇప్పటివరకు 8 మంది మృతిచెందగా అనేకమంది నిరాశ్రయులు అయ్యారు. వారిని ఆదుకోనేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు. సంపూర్ణేష్ బాబు 50 వేలు, విజయ్ దేవరకొండ లు 5లక్షలను విరాళంగా ప్రకటించారు. నందమూరి సోదరులు ఎన్టీఆర్ 15లక్షలు, కల్యాణ్‌ రామ్‌ 5 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా లక్ష రూపాయలు సీఎం నిధికి అందించారు.

తాజాగా ‘మెగా’ ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తన వంతు సాయం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు సాయం చేయమని కోరారు. “మన ప్రజల కోసం మనం నిలబడాల్సిన సమయమిది. నా వంతు సాయం చేశాను. ఆంధ్రాలోని ఇళ్లను పునర్నిర్మించుకోవడానికి కావాల్సిన ఆర్థిక సాయం చేయాలని ప్రతిఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా” అని తన ట్వీట్ లో కోరారు. ఇక వీరిలాగే మరికొంతమంది నటులు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus