బెల్లంకొండ సినిమాని సుజీత్.. ఇష్టం లేకుండానే వదులుకున్నాడట..!

  • November 20, 2020 / 08:20 PM IST

అగ్ర నిర్మాత బెల్లకొండ సురేష్ తనయుడు అయిన సాయి శ్రీనివాస్.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘ఛత్రపతి’ ని రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. శ్రీనివాస్ సినిమాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. అతని సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ ను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు అక్కడి మేకర్స్. అవి యూట్యూబ్లోనూ అలాగే లోకల్ ఛానల్స్ లోనూ రికార్డులు సృష్టిస్తున్నాయి.

అందుకే అతనితో స్ట్రెయిట్ మూవీని రూపొందించాలని బాలీవుడ్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘ఛత్రపతి’ రీమేక్ కోసం ఆల్రెడీ ‘సాహో’ దర్శకుడు సుజీత్ ను సంప్రదించారు. అయితే ఈ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసాడట సుజీత్. నిజానికి బాలీవుడ్లో సినిమా చెయ్యడం అతనికి ఇష్టమేనట. కానీ ప్రస్తుతం అతనికి లైఫ్ ఇచ్చిన ‘యూవీ క్రియేషన్స్’ నిర్మాతలతోనే.. తన 3వ సినిమాని చెయ్యడానికి రెడీ అయ్యాడట సుజీత్. ఆ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించబోతున్నాడని ఇన్సైడ్ టాక్.

ఈ కారణంతోనే బెల్లంకొండ సినిమాని వదులుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ నిర్మాతలు.. ప్రభుదేవాను సంప్రదిస్తున్నారట. రీమేక్ సినిమాలను తెరకెక్కించి హిట్లు కొట్టడంలో ప్రభుదేవా సిద్ధహస్తుడు. ఆల్రెడీ బాలీవుడ్లో అతను పెద్ద స్టార్ డైరెక్టర్ కాబట్టి.. బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీకి అతనే కరెక్ట్ అని కూడా నిర్మాతలు భావిస్తున్నారట.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus