మొన్న రాజమౌళి, త్రివిక్రమ్.. ఇప్పుడు సుకుమార్..?

  • July 17, 2020 / 08:30 PM IST

మొన్నటికి మొన్న టాలీవుడ్ అగ్ర దర్శకులైన రాజమౌళి, త్రివిక్రమ్ ల సినిమాలలో కొన్ని సీన్లు కాపీ అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. హాలీవుడ్ సినిమాల్లో కొన్ని సీన్లు.. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేసారు అంటూ నెటిజెన్లు మీమ్స్ తో రచ్చ చేశారు. ఆ సన్నివేశాలకు సంబంధించి.. ఒరిజినల్ సీన్లను కూడా కట్ చేసి.. పోస్ట్ చేసి.. ఇదిగో ప్రూవ్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు లాక్ డౌన్ వలన మన క్రియేటివ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా దొరికేసినట్టు ఉన్నాడు.

అతను తెరకెక్కించిన ‘1 నేనొక్కడినే’ సినిమా కూడా కాపీ అంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.2011 వ సంవత్సరంలో వచ్చిన ‘అన్ నౌన్’ అనే హాలివుడ్ సినిమాకి ఇది కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘1 నేనొక్కడినే’ చిత్రానికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారు సైతం ఈ ట్రోల్స్ ను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. నిఖిల్ తో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ’18 పేజెస్’ అనే చిత్రాన్ని తెరకేక్కిస్తుంది. ఈ చిత్రం కథను సుకుమార్ అందిస్తున్నాడు.

‘కుమారి 21ఎఫ్’ తెరకెక్కించిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం కథ కూడా కాపీనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘కుమారి 21ఎఫ్’ ను కూడా ఓ గ్రీకు సినిమా ఇన్స్పిరేషన్ తో తెరకెక్కించినట్టు బహిరంగం గానే ఆ చిత్రం యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus