మొత్తానికి సునయన క్లారిటీ ఇచ్చేసిందిగా..!

  • July 29, 2020 / 09:30 PM IST

వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ‘బిగ్ బాస్4’ ఉండదేమో అనే ప్రచారం జరిగింది. కానీ ఒక్క ప్రోమో రిలీజ్ చేసి ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు ‘బిగ్ బాస్4’ నిర్వాహకులు. అయితే ఈసారి ‘బిగ్ బాస్’ ను 50 రోజులు మాత్రమే నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఇక ప్రోమో రిలీజ్ అయినప్పటి నుండీ.. ఈసారి ‘బిగ్ బాస్’ హౌస్ కు వెళ్లే కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ 15 మంది పేర్లు గల లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

‘మహాతల్లి’ జాహ్నవి, యాంకర్ వర్షిణి వంటి వార్ల పేర్లు వినిపించాయి. కానీ వాళ్ళు మాత్రం ఈ ప్రచారంలో నిజం లేదు అని తేల్చి చెప్పేశారు. మరోనటి సునయిన కూడా ‘బిగ్ బాస్4’ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందని.. ఆమెకు ఒక్కో ఎపిసోడ్ కు గాను లక్ష రూపాయలు ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ విషయం పై సునయిన స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “ఇవన్నీ గాలి వార్తాలే..! అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో కూడా నాకు అర్ధం కావడం లేదు.

ఇప్పటి వరకూ ‘బిగ్ బాస్4’ వాళ్ళు నన్ను సంప్రదించలేదు. ఒకవేళ వాళ్ళు సంప్రదించినా.. నేను వెళ్ళలేను. నాకు మూడున్న‌రేళ్ల కొడుకు ఉన్నాడు. వాడికి ఆరు, ఏడు సంవ‌త్స‌రాలు వ‌చ్చేవ‌ర‌కు నేను ఎటువంటి ప్లాన్స్ వేసుకోలేను” అంటూ చెప్పుకొచ్చింది సునయన. ఈమె ‘అమ్మోరు’ ‘బాల రామాయణం’ ‘ఓ బేబీ’ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus