ఆశలన్నీ ఆ సినిమా పైనే…

  • April 27, 2017 / 05:39 AM IST

టాలీవుడ్ లో టాలెంట్ కు కొదవ లేదు…కొందరు హీరోలు అయితే వాళ్ళ మామలదో…తాతలదో చరిష్మా ఉపయోగించుకుంటూ….సేల్ అయిపోతున్నారు కానీ…అదే క్రమంలో మరికొందరు మాత్రం సొంతంగా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మంచి సినిమాలతో అలరిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు…ఈ క్రమంలో కధకు ప్రాధాన్యత ఇస్తూ…మంచి డిఫరెంట్ స్టోరీస్ ను ఎన్నుకుంటూ…హిట్స్, ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా దూసుకుతున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు…అసలైతే ఈ హీరోకి పెద్ద హిట్స్ అయితే ఏమీ లేవు…కానీ…సినిమా అంటే ప్యాషన్…సినిమా అంటే కసి అతన్ని ఇలా ట్రావెల్ చేసేలా చేస్తుంది…అదే క్రమంలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న సందీప్ కిషన్ ఆశలన్నీ కృష్ణ వంశీ ‘నక్షత్రం’ పైనే పెట్టుకున్నాడు…విషయంలోకి వెళితే…తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణవంశి ఆ మద్య మెగాస్టార్ తనయుడు రాంచరణ్ తో ‘గోవిందుడు అందరి వాడేలే’ తో భారీ డిజాస్టెర్ ను రుచి చూసాడు…ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ చిత్రం కుటుంబ నేపథ్యంలో సాగే అద్భుతమైన కథ అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఆదరించలేక పోయారు.

దీంతో కృష్ణవంశి తన తదుపరి చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ  దర్శకత్వంలో…శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై  ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. ఇక ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది… అదే క్రమంలో ఈ చిత్రంలో సుప్రీం హీరో ‘సాయి ధరమ్ తేజ్’ ఒక మంచి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే…ఆ పాత్ర అభిమానులను ఎంతగానో అలరిస్తుందన్నారు కృష్ణ వంశీ….సందీప్ కిషన్ తో…. రెజీనా, ప్రగ్య జైస్వాల్ రొమ్యాన్స్ చెయ్యనున్నారు..మరి ఈ సినిమా అయిన మన వాడికి హిట్ ఇస్తుందేమో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus