తారక్ మూవీ ఛాన్స్ వదులుకోవడంపై బలమైన కారణం

  • November 2, 2016 / 07:43 AM IST

ఫుల్ ఫామ్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ డైరక్టర్లు క్యూ కడుతుంటే సురేందర్ రెడ్డి మాత్రం వచ్చిన ఛాన్స్ ని వదులుకున్నారు. ఈ డైరక్టర్ తారక్ తో గతంలో అశోక్, ఊసరవెల్లి సినిమాలను తెరకెక్కించారు. మొదటి చిత్రం ఆశించినంత విజయం సాధించకపోయినా, రెండో మూవీ ఎన్టీఆర్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పరిచయంతో ఎన్టీఆర్ సురేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మంచి కథ ఉంటే చెప్పండి అని కోరినా సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.

ఇందుకు కారణం ఏమిటని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ధృవ సినిమాను డైరక్ట్ చేస్తున్న సురేందర్ రెడ్డి కి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయిందంట. జాగ్వార్ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నిఖిల్ గౌడను హీరోగా రీ లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నారని సమాచారం. ఇందుకోసం  నిఖిల్ గౌడ తండ్రి, నిర్మాత హెచ్.డి.కుమారస్వామి  సురేందర్ రెడ్డి కి 13 కోట్ల చెక్కును ముందుగానే అందజేశారని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. అందుకే తారక్ మూవీ ని వదులుకున్నారని వివరించారు. సో.. ధృవ పూర్తి అయిన తర్వాత  నిఖిల్ గౌడ సినిమా పనుల్లో ఈ డైరక్టర్ బిజీ కానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus