బన్నీ సినిమా నుండీ బయటకొచ్చి ఎన్టీఆర్ తో కలిశాడట..!

  • May 29, 2020 / 04:12 PM IST

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడవ చిత్రం ‘పుష్ప’. నిజానికి ఈపాటికే ఈ చిత్రం షూటింగ్ మొదలు కావాల్సి ఉంది కానీ లాక్ డౌన్ కారణంగా ఇంకా మొదలుకాలేదు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు. దానికోసం పరభాషా నటులను కూడా ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓ కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి పెట్టిన కండిషన్లకు.. నిర్మాతలు వెనుకడుగు వేశారని తెలుస్తుంది.

దాంతో అతన్ని పక్కన పెట్టి.. బాబీ సింహా ను తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ‘పుష్ప’ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క వీళ్ళు ‘ఉప్పెన’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే .. ఇప్పుడు ‘పుష్ప’ చిత్రం నుండీ విజయ్ సేతుపతి తప్పుకున్నాడు కాబట్టి, త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో తీసుకోబోతున్నట్టు సమాచారం.

ఈ మేరకు నిర్మాతలైన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు విజయ్ సేతుపతితో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. అతను కూడా సానుకూలంగా స్పందించాడట. మరి ‘పుష్ప’ చిత్రం నుండీ తప్పుకున్న విజయ్ సేతుపతి ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తాడో లేదో చూడాలి.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus