Taraka Ratna, Alekhya: తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. అవి మరవలేమంటూ?

  • February 19, 2024 / 03:20 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో ఒకరైన తారకరత్న మృతి చెంది దాదాపుగా ఏడాది అవుతోంది. ఆయన మరణం సినీ అభిమానులను ఎంతగానో బాధ పెట్టిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణించి ఏడాది కావడంతో ఆయన భార్య సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలేఖ్య తన ఇన్ స్టాగ్రామ్ లో నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్దీ.. నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిదని అన్నారు.

2023 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ నుంచి నీకు, నాకు ఎలాంటి హద్దులు లేవని రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఎలాంటి మార్పు ఉండదని ఆమె తెలిపారు. మీ ఉనికి, మీ పేరు, మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికీ మరవలేమని అలేఖ్య కామెంట్లు చేశారు. నేను నిన్ను తాకలేను కానీ నీ ఉనికి ఎల్లప్పుడూ మా చుట్టూ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఇది ఎప్పటికీ చావదని నువ్వే నా బలమని ఎప్పటికీ మాతోనే ఉంటావంటూ ఆమె పోస్ట్ చేశారు. అలేఖ్య చేసిన ఈ పోస్ట్ కు ఇన్ స్టాగ్రామ్ లో 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. మరణించిన భర్తపై అలేఖ్య చూపిస్తున్న ప్రేమను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అలేఖ్యారెడ్డి కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

అలేఖ్యారెడ్డి దంపతులకు ఒక కొడుకు , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పిల్లల పేర్లు నిష్క, తాన్యారామ్, రేయా కాగా ఎన్టీఆర్ పేరులోని అక్షరాలతో తారకరత్న దంపతులు పిల్లలకు పేర్లు పెట్టారు. తారకరత్న తన జీవిత కాలంలో వివాదాలకు దూరంగా కెరీర్ ను కొనసాగించారు. అలేఖ్యారెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో 1,15,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. (Taraka Ratna) తారకరత్న గురించి ఆమె ఎక్కువగా పోస్ట్ లు పెడుతున్నారు.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus