Teja Sajja: మొదటి ‘జాతిరత్నం’ నవీన్‌ కాదట.. ఈ కుర్ర హీరోను దాటుకుని..

‘జాతి రత్నాలు’ సినిమాలో ముగ్గురు ప్రధాన పాత్రధారులు ఉన్నా.. జోగిపేట శ్రీకాంత్‌ పాత్ర భలే హైలైట్‌ అయింది. ఆ పాత్రను పోషించిన నవీన్‌ పొలిశెట్టి కోసమే దర్శకుడు అనుదీప్‌ కేవీ రాసి ఉంటారు అని కచ్చితంగా అనిపిస్తుంది. నిన్నమొన్నటివరకు ఇదే అనుకుని ఉంటారు అందరూ. అయితే ఆ సినిమా టైమ్‌లో ఈ పాత్ర వేరే హీరో నుండి నవీన్‌ దగ్గరకు వచ్చింది అనే స్టీరియో టైప్‌ లీక్‌ అయితే ఏమీ రాలేదు. కట్‌ చేస్తే ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఆ పాత్ర కోసం తొలుత అప్రోచ్‌ ఐయిన హీరో పేరు బయటకు వచ్చింది.

Teja Sajja

అవును జోగిపేట శ్రీకాంత్‌ పాత్రకు తొలి హక్కుదారు నవీన్‌ పొలిశెట్టి కాదు. ఆ పాత్రను తొలుత విన్నది తేజ సజ్జా. అవును మన సూపర్‌ యోధానే తొలుత ఆ కథను విన్నాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. ఆయన హీరోగా నటించిన ‘మిరాయ్‌’ సినిమా విడుదల (సెప్టెంబరు 12న) సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు కొన్ని కామెంట్స్‌ చేశాడు. కానీ వివిధ కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయా అని చెప్పాడు తేజ సజ్జా. అయితే ఆ పాత్రకు నవీన్‌ పొలిశెట్టినే కరెక్ట్‌ అని చెప్పాడు.

అశోక చక్రవర్తి దగ్గర 9 దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఆధారంగా ‘మిరాయ్‌’ సినిమాను రూపొందించారు. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందనేది సినిమాలో మెయిన్‌ పాయింట్‌. దుష్ట ఆలోచనలున్న మనిషి చేతిలోకి ఆ జ్ఞాన గ్రంథాలు వెళ్లిపోతే ఏం జరుగుతుంది అనేది కథ. ఆరేళ్ల క్రితం వచ్చిన ఆలోచనను స్క్రిప్ట్‌గా రాయడానికి సమయం పట్టిందట. తేజ సజ్జా, మంచు మనోజ్‌, రితిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా వచ్చే అవకాశం ఉందని దర్శకుడు తెలిపారు.

ఇదంతా ఓకే కానీ తేజ సజ్జా ఆ సినిమాను ఎందుకు వద్దనుకున్నాడో ఏమో. ఒకవేళ చేసుంటే కెరీర్‌ ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడైతే సూపర్‌ హీరో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మరి.

తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus