బాహుబలి కంక్లూజన్ కి అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం

  • April 24, 2017 / 02:06 PM IST

బాహుబలి 2 సినిమాకి అన్నీ కలిసి వస్తున్నాయి. ఒక్కొక్క అడ్డంకి తొలిగిపోయి ప్రేక్షకుని వద్దకి పరుగులుతీస్తూ వస్తోంది. మొన్న కర్ణాటక వివాదం ముగిసి పోగా, నేడు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి అభిమానులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే వీలైనన్ని షోలు ప్రదర్శించడానికి ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఈరోజు ‘బాహుబలి- ది కంక్లూజన్’ కు తెలంగాణ ప్రభుత్వం సూపర్ ఆఫర్ ఇచ్చింది.

రిలీజైన తర్వాత మొదటి 10 రోజుల వరకు అన్ని థియేటర్లలో 6 షోల వరకు వేసుకోవచ్చని అనుమతిచ్చిన ప్రభుత్వం, ఆ తర్వాత నుంచి నాలుగు కాకుండా ఐదు షోలు వేయొచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన ప్రసాద్ దేవినేని మీడియాతో చెప్పారు. అడిగిన వెంటనే అనుకూలంగా స్పందించి అనుమతిచ్చిన తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలని తెలిపారు. ఈ ప్రోత్సాహం వల్ల నిర్మాతలకు లాభాలు పెరిగే అవకాశం ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus