బుల్లితెర స్టార్ల పై కూడా వేటు పడిందే..!

  • June 25, 2020 / 01:48 PM IST

ఓ వైరస్ మహమ్మారి కారణంగా రెండు నెలలు పైనే సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా షూటింగ్ లు మాత్రమే కాదు సీరియల్ షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. దాంతో.. అటు సినీ నిర్మాతలకు మాత్రమే కాకుండా సీరియల్ నిర్మాతలకు కూడా ఆదాయం తగ్గిపోయింది. ఈ క్రమంలో ఈ నష్టాలను భర్తీ చెయ్యడం కోసం సినిమా హీరోలు, హీరోయిన్ల పారితోషికాల్లో కోతలు విధించారు నిర్మాతలు. కేవలం సినిమా వాళ్లకు మాత్రమే కాదు.

బుల్లితెర సీరియల్ స్టార్లకు అలాగే స్టార్ యాంకర్లకు కూడా ఇచ్చే పారితోషికాల్లో కోతలు విధించారట. దానికి ఒప్పుకునే కొంతమంది షూటింగ్ లకు హాజరవుతుంటే.. మరికొంత మంది మాత్రం తక్కువ పారితోషికానికి షోలు చెయ్యడానికి ఇష్టం లేక వాటి నుండీ తప్పుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా.. ‘క్యాష్’ ప్రోగ్రాంకు గాను యాంకర్ సుమకు ఇప్పటివరకూ.. ఒక్కో ఎపిసోడ్ కు 1.5 లక్షల నుండీ 1.75 లక్షల వరకూ పారితోషికం ఇస్తూ వచ్చారట.

కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి.. ఆమెకు ఒక్కో ఎపిసోడ్ కు లక్ష రూపాయలు మాత్రమే ఇవ్వగలమని ‘మల్లెమాల’ వారు తేల్చి చెప్పేశారట. అంతేకాదు ప్రదీప్, శ్రీముఖి, అనసూయ,రష్మి.. వంటి వారి పారితోషికాలలో కూడా వారు కోతలు విధించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా సినిమా వాళ్లను మాత్రమే కాదు.. బుల్లితెర స్టార్లను కూడా ఈ వైరస్ మహమ్మారి పెద్ద దెబ్బ కొట్టిందనే చెప్పాలి.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus