శర్వా-సాయిపల్లవి కాంబినేషన్ లో మరో సినిమా.!

  • April 16, 2018 / 11:01 AM IST

హీరోలతో సమానమైన స్టార్ డమ్ సొంతం చేసుకొన్న నవతరం నటీమణి సాయిపల్లవి. ఆహా అనిపించే అందంతోపాటు.. అదరహో అనిపించే అభినయ సామర్ధ్యం ఈ మల్లూ భామ సొంతం. అందుకే స్టార్ హీరోలు, బడా డైరెక్టర్లు సాయి పల్లవి డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. అయితే.. కథ నచ్చితే తప్ప సినిమా సైన్ చేయని సాయిపల్లవికి ఈమధ్యకాలంలో ఒక తెలుగు కథ బాగా నచ్చిందట. “నీదీ నాదీ ఒకే కథ”తో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ వర్గాల ప్రశంసలు మాత్రమే కాక విమర్శకుల అభినందనలు కూడా సొంతం చేసుకొన్న వేణు ఉడుగుల చెప్పిన కథ సాయిపల్లవికి విపరీతంగా నచ్చేసిందట.

వెంటనే ప్రస్తుతం తనతో కలిసి నటిస్తున్న శర్వానంద్ కి కూడా ఆ కథను చెప్పించగా.. అతడికి నచ్చడంతో ప్రొజెక్ట్ త్వరలోనే సెట్స్ కి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలోనూ నిత్యామీనన్ చెప్పిందని “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” సినిమాలో నటించాడు శర్వానంద్. ఈ సినిమా తర్వాత మళ్ళీ హీరోయిన్ కోసం చేయనున్న సినిమా ఇదే. ప్రస్తుతం “పడి పడి లేచే మనసు” చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలే సాయిపల్లవి-శర్వానంద్ ల సెకండ్ సినిమా కూడా నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus