Tharun Bhascker: తరుణ్ భాస్కర్.. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు?

Advertisement

దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker) నటుడిగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అతను హీరోగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమా రూపొందింది. ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఇందులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. క్యూ అండ్ ఎలో భాగంగా ఓ సీనియర్ రిపోర్టర్ మైక్ అందుకుని తరుణ్ భాస్కర్..కి ఓ ప్రశ్న వేయడానికి రెడీ అయ్యాడు.

Tharun Bhascker

అయితే తరుణ్ భాస్కర్ అత్యుత్సాహం ప్రదర్శించి.. ఆ రిపోర్టర్ కి ‘హ్యాపీ క్రిస్మస్’ అంటూ వెటకారపు కామెంట్ విసిరాడు. గతంలో ‘కీడా కోలా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా తరుణ్ భాస్కర్ ఆ రిపోర్టర్ ని ‘క్రిస్మస్ తాత’ అంటూ పంచ్..లు వేశాడు. అతని కామెంట్ ను పట్టుకుని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజెన్ల ఆ రిపోర్టర్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నిన్నటి ఈవెంట్లో కూడా అలాగే చేద్దామని తరుణ్ భాస్కర్ అనుకున్నాడు.

కానీ ఆ రిపోర్టర్ కి కోపం వచ్చింది. ‘మిమ్మల్ని ప్లాప్ హీరో. పదేళ్లుగా హిట్టు లేని డైరెక్టర్ అంటే మీరు ఊరుకుంటారా? మా పై కామెంట్లు చేసి.. జనాలకి ట్రోల్ మెటీరియల్ ఇవ్వడానికే ఈవెంట్లకి వస్తారా. నేను లేచి వెళ్ళిపోతున్నాను’ అంటూ ఆ రిపోర్టర్ ఆవేశంతో లేచి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ వెళ్లి..అతని కాళ్లపై పడి క్షమాపణలు చెప్పి.. ‘మనం కలిసి ట్రోలింగ్ బ్యాచ్ ని ట్రోల్ చేద్దాం’ అంటూ చెప్పి.. సదరు రిపోర్టర్ ని కూల్ చేశాడు.

దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది నెటిజెన్లు ‘తరుణ్ భాస్కర్ ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నట్టు. ఇదంతా స్క్రిప్టెడ్ లా ఉంది’ అంటూ తమ అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.

లేట్‌గా బయటకొచ్చిన వార్త… రాజశేఖర్‌కు గాయం.. సర్జరీ కూడా పూర్తి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus