సురేష్ బాబుకి డైరెక్టర్ దొరికినట్లే!

  • December 28, 2020 / 05:24 PM IST

చాలా రోజులుగా టాలీవుడ్ లో దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికోసం చాలా ప్రయత్నాలే జరిగాయి. వెంకటేష్, రానాలను హీరోలుగా పెట్టి సినిమా తీయాలనేది సురేష్ బాబు ఆశ. దానికోసం కొన్ని కథలను కూడా రెడీ చేశారు కానీ అవేం వర్కవుట్ కాలేదు. ఇప్పుడు దగ్గుబాటి హీరోల కోసం మరో మల్టీస్టారర్ కథ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రచయిత, దర్శకుడు సతీష్ వేగ్నేశ ఈ కథ రెడీ చేశారట.

ఈ విషయాన్ని సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు. దగ్గుబాటి మల్టీస్టారర్ చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నట్లు.. చాలా కథలు విన్నాం కానీ కుదరలేదని అన్నారు. ఇప్పుడు సతీష్ వేగ్నేశ ఓ కథ సిద్ధం చేశారని.. అన్నీ కుదిరితే తప్పకుండా సినిమా చేస్తామని అన్నారు. సతీష్ వేగ్నేశకి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేయడంలో మంచి పట్టుంది. ఆయన తెరకెక్కించిన ‘శతమానం భవతి’ సినిమా నేషనల్ అవార్డుని అందుకుంది. ఈ సినిమాతో ఆయన ఫ్యామిలీ డ్రామాలు బాగా తీయగలడనే విషయం అర్ధమైంది.

దగ్గుబాటి మల్టీస్టారర్ అంటే ప్రేక్షకులు ఫ్యామిలీ డ్రామానే కోరుకుంటారు. అలాంటి కథను సతీష్ సిద్ధం చేయగలిగితే.. తప్పకుండా ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తున్నారు. అలానే రానా చేతుల్లో రెండు, మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తరువాత ఈ ఇద్దరు హీరోల కాల్షీట్ల బట్టి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus