Chiranjeevi, Rajinikanth: ఆ నిర్మాత వల్ల మంచి మల్టీస్టారర్ మూవీ మిస్ అయిపోయింది..!

  • August 18, 2022 / 01:22 PM IST

చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ సూపర్ స్టార్లే..!అంతకు మంచి మంచి స్నేహితులు కూడా..! ‘కాళి’ ‘బందిపోటు సింహం’ వంటి ఎన్నో సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు ఈ స్టార్ హీరోలు. టాలీవుడ్ ను చిరు, కోలీవుడ్ ను రజినీకాంత్ చాలా కాలంగా ఏలుతున్నారు. అయితే వీళ్ళు స్టార్లు అయిన తర్వాత కలిసి నటించింది లేదు. ఓ సూపర్ హిట్ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించే అవకాశం వచ్చినా ఓ స్టార్ ప్రొడ్యూసర్ వల్ల అది మిస్ అయ్యిందని తెలుస్తుంది.

ఆ సినిమా మరేదో కాదు ‘రంగేళి’. ఇక ఈ మల్టీస్టారర్ ను మిస్ చేసిన నిర్మాత మరెవరో కాదు అశ్వినీదత్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. “ఒకానొక టైంలో రాము నాకు రెండు కథలు చెప్పారు.అవి ‘రంగీలా’ ‘గోవిందా గోవిందా’. మొదట నేను రంగీలా సినిమా చేద్దామనుకున్నాను. ఈ సినిమా కోసం చిరంజీవి, రజినీకాంత్, శ్రీదేవి లను అనుకున్నాను.

కానీ చిరు, రజనీ ల దగ్గరకు వెళ్లి గెస్ట్ రోల్స్ అంటే ఏమనుకుంటారో, అలాగే ముక్కోణపు ప్రేమకథ అవసరమా అని భావించి రంగీలా సినిమా వదులుకున్నాను.అప్పుడు ‘గోవిందా గోవిందా’ కథ ఓకే చేశాను. ఇందులో వెంకటేశ్వర స్వామి గుడిలో దోపిడి అనే విధంగా కథ పెట్టి తీస్తే బాగుంటుంది అనిపించింది.

ఆ విధంగా నాకు ‘గోవిందా గోవిందా’ నేను చేయడం జరిగింది. అమీర్ ఖాన్ కి ‘రంగీలా’ వెళ్ళింది” అంటూ చెప్పుకొచ్చారు అశ్వినీదత్. ప్రస్తుతం ‘సీతా రామం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయన ప్రభాస్ తో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus