ఎన్టీఆర్, బాబీ సినిమాలో ఖరారైన ముగ్గురు కథానాయికలు

  • December 14, 2016 / 01:55 PM IST

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయనున్న మూవీ ప్రకటించిన రోజు నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో  నిర్మాత కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ మూడు పాత్రల్లో మెరవనున్నారు. ఈ ముగ్గురి పక్కన నటించే భామల ఎంపికను డైరక్టర్ బాబీ పూర్తి చేశారు. అందులో ఒకరు  కాజల్ అగర్వాల్. ఈమెతో ఎన్టీఆర్ బృందావనం, టెంపర్ సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు మూడో సారి జత కట్టనున్నారు. మిగిలిన ఇద్దరూ మలయాళ భామలు అనుపమ పరమేశ్వరన్, మంజిమ మోహన్.

‘అఆ’, ‘ప్రేమమ్‌’ చిత్రాలతో అదరగొట్టిన అనుపమ త్వరలోనే ‘శతమానం భవతి’తో సందడి చేయబోతోంది. ఇప్పుడు తారక్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న మంజిమ మోహన్ కి కూడా ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కింది. వంద కోట్లతో రూపుదిద్దుకోనున్న ఈ మూవీలో హరికృష్ణ, కళ్యాణ్ రామ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండడం మరింత బలాన్ని అందిస్తోంది. ఈ మూవీ కోసం పాటలను కంపోజ్ చేయడంలో మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ నిమగ్నమయ్యారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus