ఆ తల్లిదండ్రులకు నేనే ఓ బిడ్డగా నిలుస్తా: పవన్ కళ్యాణ్

  • September 1, 2020 / 10:44 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా శాంతిపురం లో కొందరు అభిమానులు ప్లాన్ చేశారు. అయితే అనుకోని ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ విషాదం నెలకొంది. పవన్ బర్త్ డే బ్యానర్లు పడుతుండగా విద్యుత్ షాక్ తగలడంతో ముగ్గురు అభిమానులు మరణించారు. మరో నలుగురైదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభిమానుల కుటుంబాలకు అండగా నిలుస్తానని ఆయన తెలిపారు.

“శాంతిపురం దగ్గర కటౌట్ కడుతుండగా విద్యుత్ షాక్ తగలడంతో జనసైనికులు మరణించాడనే వార్త నా మనసును తీవ్రంగా కలచి వేసింది. సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం తల్లిదండ్రుల గర్భశోకాన్ని అర్థం చేసుకోగలను. వారికి బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనక ఆ తల్లిదండ్రులకు నేనేమో బిడ్డగా నిలుస్తా. వారి కుటుంబాలను ఆర్థిక ఆదుకుంటా” అని జనసేనాని పవన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నా జనసైనికులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చూడమని బాధిత కుటుంబాలతో తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ స్థానిక నాయకులకు సూచించినట్లు పవన్ చెప్పారు.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus