ఆ సినిమాలో నాతో అసభ్యకరమైన సన్నివేశాలు చేయించాడు..!

  • December 2, 2020 / 08:00 PM IST

అప్పటి స్టార్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ తెలుగు,తమిళ,మలయాళం,కన్నడ భాషల్లో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. వాటిలో ‘శుభాకాంక్షలు’ ‘మనసిచ్చి చూడు’ ‘గోకులంలో సీత’, ‘ ‘ప్రేయసి రావే’ 20 సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పోస్ట్ మాన్’ చిత్రంలో ఈమె ఒక బోల్డ్ సీన్ లో నటించింది. దానికి అప్పట్లో చాలా రచ్చ జరిగింది. తొలగించాలని అప్పట్లో నిరసన వ్యక్తం చేశారు.

అప్పటి నుండి అలాంటి బోల్డ్ సన్నివేశాల్లో చెప్పిన రాశి… మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నిజం’ చిత్రంలో గోపీచంద్ తో కలిసి ఇంటిమేట్ సీన్లలో నటించింది. ‘పోస్ట్ మాన్’ సినిమా టైంలో ఇప్పటి నుండీ తన ఇమేజ్కి చెడ్డ పేరు తెచ్చిపెట్టే పాత్రలు ఇక చెయ్యను అని చెప్పిన రాశీ…. ‘నిజం’ సినిమాలో అలాంటి పాత్ర పోషించడం పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. రాశీ ఎన్ని సార్లు మీడియా ముందుకు వచ్చినా.. ఆ చిత్రం గురించి …

ముఖ్యంగా ఆ చిత్రంలో రాశీ అసభయకరమైన సన్నివేశాల గురించి అనేక ప్రశ్నలు ఎదరవుతూనే ఉన్నాయి. అయితే రాశీ మాత్రం ఈ విషయం పై ఓపికగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ‘డైరెక్టర్ తేజ నాకు చెప్పింది ఒకటి తీసింది ఒకటి. ముందుగా నాకు డౌట్ వచ్చింది.. కానీ అప్పటికే ఆ చిత్రం చేస్తాను అని కమిట్ అయిపోయాను. ఇలాంటి పెద్ద సినిమా మాటిచ్చి వదిలెయ్యడం దేనికి అని మా మేనేజర్ చెప్పాడు. దాంతో ఇక ఆప్షన్ లేక ఆ ప్రాజెక్టుని పూర్తి చేశాను ‘ అంటూ రాశీ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus